
చంద్రునికి ఒకవైపు రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు ఉండగా.. మరోవైపు దక్షిణ ధృవంలో భారత్ మాత్రమే ఉంది. దక్షిణ ధృవాన్ని చేరుకోవడం ఒక పెద్ద సవాలు.. దీనిని భారతదేశం పూర్తి చేసింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అవడంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలు పటాకులు పేల్చి దేశం సాధించిన విజయానికి హర్షం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రసారాన్ని వీక్షిస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ తన ఆనందాన్ని తెలిజేశారు

అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో చంద్రుని ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాఠశాల విద్యార్థుల.. ఇతరులు సంబరాలు చేసుకున్నారు.

మధురై జిల్లాలో చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు మున్సిపల్ కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

CSIR ప్రధాన కార్యాలయంలో చంద్రుని ఉపరితలంపై ISRO చంద్రయాన్-3 విజయవంతం అవడంతో సాఫ్ట్ తో పాటు సామాన్యులు కూడా సంబరాలు జరుపుకున్నారు.

రాంచీలో చంద్రుని ఉపరితలంపై ఇస్రో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అవడంతో ధోనీ ఫ్యామిలీ సహా ప్రజలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

డబ్లిన్లోని భారత క్రికెట్ జట్టు ఇస్రో విజయవంతమైన చంద్రయాన్ ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించింది.

చంద్రుని ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు జరుపుకునే కార్యక్రమంలో CSIR అధికారులు ఫోటోలు తీస్తున్నారు.

చంద్రుడి ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత భోపాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.