
మంగళ వారం చంద్ర గ్రహణం కావడంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతున్నారు. ఇక దీని ప్రభావం వలన హోలీ పండుగను గ్రహణం తర్వాత రోజు మార్చి4న జరుపుకోనున్నాయి. ఇక ఈ గ్రహణం మార్చి 3 మధ్యాహ్నం ప్రారంభమై, సాయంత్రం 6.30 వరకు ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలపై గరక లేదా దర్భ గడ్డి వేసుకోవడం మంచిదంటారు. అయితే ఎలాంటి పదార్థాలపై వేయాలి అంటే?

గ్రహణం సమయంలో హానికరమైన రేడియేషన్ ప్రభావం ఆహారపదార్థాల మీద పడకుండా దర్భ లేదా గరిక వేయాలి అంటారు. ముఖ్యంగా రాహు, కేతువుల చెడు ప్రభావం కూడా పొగొట్టడానికి దర్భ గడ్డిని ఆహారపదార్థాల మీద వేస్తుంటారు. దీని వలన ఆహారం శుద్ధిఅయినట్లు.

అయితే గ్రహణం సమయంలో ఊరగాయలపై దర్భ గడ్డి వేయాలి. అంతే కాకుండా పాలు, పెరుగు, బియ్యం వంటి ఆహార పదార్థాలపై దర్భ గడ్డి లేదా గరక వేయడం వలన ఇది చెడు కిరణాలను నిరోధిస్తుందంట.

ఇవే కాకుండా, తాగు నీరు, మిక్సీ పప్పు గిన్నెలు, తాంబూలం , వండిన అన్నం, నిలువ పప్పులు, చింత పండు, వంట సామానుల ర్యాక్ వంటి వాటిపై కూడా తప్పకుండా దర్భ లేదా గరిక గడ్డిని వేయాలి అని చెబుతున్నారు పండితులు. ఇది గ్రహణ ప్రభావాన్ని తొలిగిస్తుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు