
శాస్త్రాల ప్రకారం, పూర్వ జన్మలో మహాపుణ్యం చేసుకున్న వారికి లేదా, గొప్ప సుకృతం చేసిన వారికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుందంట. వారి నాలుకపై ఓ ప్రత్యేక శక్తి ఉంటుందట. దీనినే వాక్ సుద్ధీ అంటారు. అంటే మాటల్లో పవిత్రత. ఈ వాక్ సుద్ధీ వలన వారు మాట్లాడే మంచి చెడు మాటలు ఏవో ఒక్కరోజు తప్పకుండా జరుగుతాయంట. అందుకే వారు మంచి ఆశీర్వచనం, ఇస్తే అది తప్పకుండా జరుగుతుందని చెబుతుంటారు.

అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఈ నాలుకపై మచ్చలు కూడా రెండు రకాలుగా ఉంటాయంట. నాలుక దిగువ భాగంలో, నాలుక ఎగువ భాగంలో మచ్చలు ఉంటాయి. అయితే ఎవరికి అయితే నాలుక దిగువ భాగంలో మచ్చలు ఉంటాయో, వారు భోజన ప్రియులంట. అంతే కాకుండా మంచి కళానైపుణ్యం కలిగి ఉంటారని చెబుతున్నారు పండితులు.

ఇక నాలుకపై మచ్చలు ఉండటం మాత్రం అశుభకరం అంటున్నారు సాముద్రిక శాస్త్ర నిపుణులు. ఇలా నాలుకపై మచ్చలు ఉన్నవారు, తొందరపడి మాట్లాడటం మంచిది కాదంట. ఎందుకంటే వారు, మాట్లాడేది నిజం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అందుకే వారు ఎక్కువగా ఆలోచించి మంచి విషయాలే మాట్లాడలని చెబుతున్నారు పండితులు.

ఇక చాలా మంది నాలుకపై మచ్చలు ఉన్నవారు ఏది మాట్లాడినా నిజం అవుతుందని చాలా భయపడి పోతుంటారు. కానీ ఇదే నిజం అని చెప్పలేం అంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని సార్లు జరగచ్చు, జరగక పోవచ్చు. చాలా వరకు ఈ మచ్చలు అనేవి అనారోగ్య సమస్యలను సూచిస్తాయిని వారు చెబుతున్నారు.

నాలుకపై మచ్చలు ఉన్నవారు, ఎక్కువగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. అంతే కాకుండా వారు మాట్లాడితే నిజం అవుతుందని ఆధారాలతో ఎక్కడా నిరూపితం కాలేదు. కానీ పూర్వకాలం నుంచి పెద్దలు నాలుకపై మచ్చలు ఉన్నవారు ఏదీ మాట్లాడినా నిజం అవుతుందని చెబుతుంటారు కాబట్టి, మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.