
జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురు వారం రోజు పుష్య నక్షత్రం కనిపించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు మూడు రాశుల వారు అత్యధిక లాభాలు అందుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా గురు పుష్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధనానికి లోటే ఉండదు. ఊహించని విధంగా ఇంటిలో డబ్బు నిలువకు వస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు, గురు పుష్యమృత యోగం వలన వీరికి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి.

సింహ రాశి : సింహ రాశి వారికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతే కాకుండా సమాజంలో మీకంటూ సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ అందుకోవడం లేదా, మంచి జీతం అందుకోవడం జరుగుతుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురు పుష్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా పుష్య నక్షత్రానికి అధిపతి శని అవ్వడం, ఈ రాశి చంద్రుడికి చెందినది కావడంతో, ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్య పరంగా, ఉద్యోగం పరంగా అన్ని విధాలుగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరికి అన్నింట్లో శుభ ఫలితాలే కలుగుతాయి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు