అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం పైకప్పు పనులు 40 శాతం పూర్తయ్యాయి. రామ మందిరం వడి వడిగా అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత గర్భగుడిలో రామ్ లల్లా ప్రతిష్టాపన తేదీని ప్రకటించారు. జనవరి 22, 2024న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రామాలయంలో కొత్త, పాత రామ్లల్లా విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నారు. జనవరి 22, 2024న, రామమందిరంలోని గర్భగుడిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామ్ లల్లాను ప్రతిష్టి్స్తారు.
ఆ తర్వాత రామమందిరాన్ని భక్తుల కోసం తెరవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న రామభక్తులు ఈ గుడి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, ఏప్రిల్ 24న ప్రపంచంలోని ఏడు ఖండాలకు చెందిన 155 దేశాల నదుల నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలోని రామలల్లా ఈ నీటితో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, వివిధ దేశాల రాయబారులు, ఎన్నారైలు పాల్గొన్నారు.