
2026 ఏప్రిల్ 19న అక్షయతృతీయ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి , ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. అంతే కాకుండా, దేవాలయాలను సందర్శించి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకొని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఇక ఈ అక్షయ తృతీయ వేళ చాలా మంది కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది కొత్త బట్టలు కొనుగోలు చేయడం, మరికొంత మంది బంగారం లేదా వెండి కొనుగోలు చేసి, దేవుడి గదిలో పెట్టి పూజలు చేస్తారు. అయితే ఇంత పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం, కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడం అస్సలే మంచిదికాదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదంట. ఈ రోజు ఇనుప వస్తువుల కొనుగోలు చేయడం అశుభకరం. అదే విధంగా ఈ రోజున ముళ్ల మొక్కలు, పదునైన వస్తువులు, నలుపు రంగు దుస్తులు కొనుగోలు చేయడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే అక్షయతృతీయ రోజున స్టీల్ వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిది కాదంట. అంతే కాకుండా ఈ రోజు మాంసాహారం తినడం మహాపాపం. ఈ రోజు మాంసాహారం తినకూడదు, ఇతరులతో గొడవ పెట్టుకోవడం అస్సలే మంచిదికాదంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.