
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం ఇలా చేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉండే సాంప్రదాయ స్వీట్. పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం పంచదార కలిపి పాలతో చేసే రుచికరమైన తియ్యటి వంటకం. జీడిపప్పులతో చేసే ఈ పాయసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకుని తినొచ్చు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం వంటి పండుగల సమయంలో చేసే నైవేద్యం ఇది. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదా పేస్ట్, ఒక కప్పు పాలు, ఒక కప్పు బెల్లం ముక్కలు , కప్పున్నర పంచదార, రుచి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 100 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్స్ యాలకుల పొడిని తీసుకోవాలి.

ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా సిద్ధం చేసుకోవాలి: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను బాగా కడిగి వాటిని మిక్సీలో తీసుకుని దానిలో అర గ్లాస్ పాలు పోసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని. ఆ తర్వాత వీటి నుంచి కొబ్బరి పాలను వేరు చేసి ఒక గ్లాస్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుని. వీటిని వేశాక టేస్ట్ మొత్తం మారిపోతోంది.

ఇక ఇప్పుడు బాగా వేయించుకోవాలి : ముందుగా గ్యాస్ వెలిగించి ఒక పాన్ లేదా చిన్న పాత్ర పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత దానిలో 100 గ్రాముల జీడిపప్పు,ఆలాగే కిస్మిస్ లు కూడా వేసి ఒకటికి రెండు సార్లు బాగా వేయించి ప్లేట్ లేదా గిన్నెలో వీటిని పెట్టుకోవాలి. అయితే, మీరు వీటిని తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవడం మంచిది తినేటప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్.

కొబ్బరి పాయసాన్ని ఇలా ఉడికించుకోవాలి : ఇంకో పాన్లో ఒక కప్పు కొబ్బరి పాలు, ఇంకో కప్పు సాధారణ పాలు తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత తర్వాత బెల్లం ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే జీడిపప్పు, రెండు స్పూన్స్ యాలకుల పొడి కూడా దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.