
ఐఫోన్ 14: ఐఫోన్14కి ఈ ఏడాది భారీగా క్రేజ్ లభించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ను విడుదల చేశారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఏ 15 బయోనిక్ చిప్ను, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్లో ఏ16 బయోనిక్ చిప్ను ఉపయోగించారు. బేస్ వేరియంట్లలో 12 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చితే, ప్రో వేరియంట్లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్తో 48 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇండియాలో ఈ ఫోన్ ధర ప్రారంభ ధర రూ. 79,900కాగా హై ఎండ్ వేరియంట్ రూ. 1,39,900గా ఉంది.

గూగుల్ పిక్సెల్ 7: ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన పోయిన మరో ఫోన్ గూగుల్ పిక్సెల్ 7. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్ను విడుదల చేసింది. ఈ ఫోన్లలో టెన్సర్ జీ2 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ను ఉపయోగించారు. పిక్సెల్ 7లో 6.3 అంగుళాలు, పిక్సెల్ 7ప్రోలో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ధర విషయానికొస్తే దీని ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ సిరీస్: ఈ ఏడాది ఆకట్టుకున్న మరో ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ సిరీస్.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 పేరుతో ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,42,000గా ఉంది.

నథింగ్ ఫోన్ వన్: ఈ ఏడాది యూజర్లను అధికంగా ఆకట్టుకున్న ఫోన్లలో నథింగ్ ఫోన్ ఒకటి. దీంట్లో 6.55 ఇంచెస్ ఫుడ్హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 778 జీ+ ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది.

షావోమి 12ఎస్ ప్రో: షావోమీ 12 ఎస్ ప్రోలో అత్యాధునిక ఫీచర్లను అందించారు. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా ఉన్న ఈ ఫోన్లో 6.73 ఇంచెస్ డిస్ప్లేను అందించారు. ధర విషయానికొస్తే రూ. 59,999గా ఉంది.