
తెలంగాణలో సెలవులు: తెలంగాణలో విద్యార్థులకు వరుసగా రెండ్రోజుల పాటు సెలవులు దొరకనున్నాయి. ఆగస్ట్ 9వ తేదీన ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉండగా.. తెలంగాణ సర్కార్ సోమవారం కూడా సెలవును ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్లో సెలవులు: అటు ఏపీలోనూ ఆగస్ట్ 9న ఆదివారం కారణంగా సాధారణ సెలవుదినం కాగా.. ఆగస్టు 21వ తేదీన కూడా విద్యార్థులకు సెలవు లభించనుంది. ఎందుకంటే ఆ రోజు వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణలో కూడా పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ క్యాలెండర్కు తగ్గట్టుగా ఈ సెలవులను ప్రకటించాయి.

కేరళలో సెలవులు: ఇక కేరళలోనూ స్కూళ్లకు వరుస సెలవులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. గత వారం రోజులుగా కేరళ వ్యాప్తంగా స్కూల్స్ మూతపడే ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్లో సెలవులు: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాన్వర్ యాత్ర సందర్భంగా అక్కడి విద్యాసంస్థలకు యూపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. యాత్ర కారణంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 10న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్ట్ 12వ తేదీ వరకు పలు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉన్నాయి.

మణిపూర్, కర్ణాటకలో సెలవులు: ఇక మణిపూర్లోనూ ఆగస్టు 13ను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. పేట్రియాట్స్ డే (Patriots' Day) సందర్భంగా ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కర్ణాటకలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.