
జోతిష్య శాస్త్రం ప్రకారం, శని వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఇలా వారు ఏది చేస్తే అది తిరిగి ఇస్తాడు. అందుకే, మంచి పనులు చేయాలని మన పెద్దలు చెబుతారు.

శని గ్రహాన్ని వేరే వాటితో పోలిస్తే.. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు. ప్రస్తుతం, మీన రాశిలో శని దేవుడు ఉన్నాడు. త్వరలో శని అస్తమించనున్నాడు. అంటే ఉగాది తర్వాత అస్తమించి మళ్లీ తిరిగి ఏప్రిల్ నెలలో ఉదయించనున్నాడు. దీనితో రెండు రాశుల వారి దశ తిరగబోతుంది.

వృశ్చిక రాశి: శని అస్తమించడం వలన వృశ్చిక రాశి వారికి మంచిగా ఉండనుంది. ఉగాది తర్వాత నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోనుంది. వీరు ఎక్కకెళ్ళినా అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాకుండా.. విలాసవంతమైన జీవితం కూడా గడుపుతారు.

మేష రాశి : శని అస్తమయంతో మేష రాశివారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి శుభవార్తలు చాలానే వింటారు. పెట్టుబడుల్లో ఊహించని విధంగా లాభాలు వస్తాయి. సంతానం కోరుకునే వారు గుడ్ న్యూస్ వింటారు. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మార్చి 19 నుంచి కొత్త ఏడాది ప్రారంభకానుంది. అయితే, ఇది కొందరికి మంచిగా ఇంకొందరికి ప్రతికూలంగా ఉండనుంది.