
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. త్వరలో, గురు గ్రహం సంచారం చేయనుంది. అయితే, రెండు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది.

శని గ్రహాన్ని వేరే వాటితో పోలిస్తే.. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు. ప్రస్తుతం, మీన రాశిలో శని దేవుడు ఉన్నాడు. త్వరలో శని అస్తమించనున్నాడు. అంటే ఉగాది తర్వాత అస్తమించి మళ్లీ తిరిగి ఏప్రిల్ నెలలో ఉదయించనున్నాడు. దీనితో రెండు రాశుల వారి దశ తిరగబోతుంది.

వృశ్చిక రాశి: శని అస్తమించడం వలన వృశ్చిక రాశి వారికి మంచిగా ఉండనుంది. ఉగాది తర్వాత నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోనుంది. వీరు ఎక్కకెళ్ళినా అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాకుండా.. విలాసవంతమైన జీవితం కూడా గడుపుతారు.

మేష రాశి : శని అస్తమయంతో మేష రాశివారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి శుభవార్తలు చాలానే వింటారు. పెట్టుబడుల్లో ఊహించని విధంగా లాభాలు వస్తాయి. సంతానం కోరుకునే వారు గుడ్ న్యూస్ వింటారు. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.