
సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు వేరుశెనగ, ఒక చిన్న ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, ఒక బంగాళాదుంప, నిమ్మరసం, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర ఆకులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్స్ బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, వడలు ఎర్రగా వేయించడానికిసరిపోను ఆయిల్ ను తీసుకోవాలి.

సగ్గుబియ్యం వడల తయారి విధానం : మీరు ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటిని పెద్ద గిన్నెలో నానబెట్టుకుని తీసుకోవాలి. ఇంకా ఈ పిండిని తయారు చేసుకునేందుకు పెద్ద పాత్ర మంచిది. ఆ తర్వాత దానిలో నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పును కూడా తీసుకోవాలి.

సగ్గుబియ్యం వడల తయారి విధానం స్టెప్ 2: ఇంకా ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంపలు, కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇంకా వేరుశెనగలు పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని దీనిలో కలపాలి. అప్పుడే ఈ వడలు మంచి ఆకారం పొందుతాయి.

సగ్గుబియ్యం వడల తయారి విధానం స్టెప్ 3 : ఈ పిండిని మంచిగా కలపడం వల్ల ఈ సగ్గుబియ్యానికి దీనిలో వేసిన అన్ని ఫ్లేవర్లు కూడా చక్కగా అందుతాయి. ఇక ఇప్పుడు దీనిలో తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న వడలుగా చేసుకుని కాల్చుకోవాలి. మీరు కూడా పక్కాగా వీటిని చేసుకోండి.

ఈ వడలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఇవి బాగా వేడయ్యాక అయిన దీనిలో ఈ వడలు వేయాలి. అయితే వీటిని మీరు మీడియం మంట మీద మాత్రమే వీటిని బాగా కాల్చుకోవాలి . ఇవి గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత తీసి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్ లో కానీ వీటిని ఉంచుకోవాలి. ఇంకా మీరు వీటిని పెరుగుతో తింటే రుచికరంగా ఉంటుంది. లేదంటే మీకు పల్లీల చట్నీతో కూడా వీటిని తినొచ్చు.