
ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో 'నాడు నేడు' పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టూడెంట్స్తో కాసేపు సరదాగా ముచ్చటించిన ఆమె.. ఆ తర్వాత టీచర్ అవతారం ఎత్తి పిల్లలకు లెసన్స్ చెప్పారు.

ఇంతవరకూ అంతా బానే ఉన్నా, ఆమె మాస్క్ లేకుండా తిరగడం విమర్శలకు తావిచ్చింది. ఆమెకు మాత్రమే కాదు. ఆమె చుట్టూ ఉన్నవారిలో చాలామందికి మాస్కుల లేవు.

స్కూల్ అంటే పిల్లలు ఉండే ప్రదేశం. వారికి ఇంకా వ్యాక్సినేషన్ కూడా కాలేదు. ఈ క్రమంలో శాసనసభ్యురాలు ఇలా అక్కడ తిరగడం కరెక్ట్ కాదని కొందరంటున్నారు.

ఎమ్మెల్యే రోజాతో పాటు, పిల్లలకు చెప్పాల్సిన టీచర్లు కూడా అక్కడ మాస్క్ లేకుండా సంచరించడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇవేనా పాఠశాలల్లో కోవిడ్ ప్రమాణాలు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.