
ప్రస్తుతం అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలతో ఎంతో మంది బాధ పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా.. ఎన్నో రకాల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకు వస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. పూర్వం ఇది ఎవరికో ఒకరికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్గా అయిపోయింది.

అయితే కొన్ని రకాల ఆహారాలు తింటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే బంగాళ దుంప తింటే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇది మీరు నమ్మలేకపోతున్నారా. కానీ ఇది నిజం అని అంటున్నారు నిపుణులు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. ఆలు గడ్డ తింటే క్యాన్సర్ వస్తుంది.

ఆలుగడ్డలో ఆక్రిలామైడ్ అనే రసాయనం ఉంటుంది. కాబట్టి వీటిని కొన్ని రకాల చక్కెరలతో అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ సారి బంగాళ దుంప తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. సరైన నిద్ర ఉంటే.. రొమ్ము, పెద్దప్రేగు, అండాశయాలు, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అదే విధంగా క్యాన్సర్ను నివారించే ఆహారాలు తీసుకోవడం కూడా అవసరం.