
మనం ఇప్పటి వరకు పండ్లతోనే పచ్చళ్ళు చేయడం చూశాము. ఈ సారి కొత్తగా రేగి పండ్లతో పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు: ఎండిన రేగి పండ్లు, ఒక టేబుల్ స్పూన్ కారం, చింతపండు, అర టీ స్పూన్ ఆవాల పొడి, 100 గ్రాముల బెల్లం, చింతపండు రసం, కారం, అర టీ స్పూన్ ఆవాల పొడి, రుచి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె.

ఇప్పుడు రోటిలో రేగి పండ్లు, బెల్లం, చింతపండు, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరి పడా ఉప్పు, అర టీ స్పూన్ ఆవాల పొడి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం పాన్ లో పోపు గింజలు, ఆవాలు, ఎండు మిర్చి వేసి పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి.

ఇప్పుడు రోటిలో రేగి పండ్లు, బెల్లం, చింతపండు, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరి పడా ఉప్పు, అర టీ స్పూన్ ఆవాల పొడి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం పాన్ లో పోపు గింజలు, ఆవాలు, ఎండు మిర్చి వేసి పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి.

రోట్లో నూరిన తర్వాత ఈ పచ్చడిని గాలి చొరబడని పాత్రలో పెట్టుకుంటే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడు ఇడ్లీ దోసెలు వేసుకున్నా చట్నీ ఇది వేసుకుని తింటే రెండు తినే వాళ్లు నాలుగు తింటారు.