
మనకి జామకాయ పండుగానే తెలుసు కానీ దీనితో పచ్చడి కూడా చేస్తారు ఇది చాలా మందికి తెలియదు. జామకాయతో రోటి పచ్చడి ఎలా చేస్తారా అని సందేహిస్తున్నారా? కేవలం కూరగాయలతోనే కాకుండా పండ్లతో కూడా పచ్చళ్లు చేస్తారు. ఇది మీరు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు.

కావాల్సిన పదార్ధాలు: నాలుగు పచ్చి జామకాయలు, 4 టేబుల్ స్పూన్లు నూనె, ఒక కప్పు వేయించిన పల్లీలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజంతా చింతపండు,రుచికి తగినంత ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా శనగపప్పు, నాలుగు ఎండుమిర్చి 5, 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా నాలుగు కరివేపాకు, ఇంకా రుచికి సరిపడా పసుపు , ఇంకా కొత్తిమీరను కూడా తీసుకోవాలి.

జామకాయ పచ్చడి తయారీ విధానం : ముందుగా జామకాయలను కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో చింతను నీళ్లలో నానబెట్టాలి. అదే విధంగా స్టవ్ ను వెలిగించి పొయ్యి మీద పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, పల్లీలను కూడా వేయించాలి. అదే విధంగా పచ్చి మిర్చి బాగా వేయించాలి.

జామకాయ పచ్చడి తయారీ విధానం : వేయించిన పల్లీలు, అలాగే మగ్గించిన పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసి మిక్సీ గ్రైండ్ చేసి.. ఉప్పు కూడా వేసి దానిని బాగా మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. ఆ తర్వాత జామకాయ ముక్కలు, కొత్తిమీరను కూడా వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి.

పోపు కోసం పాన్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు వేసి ఆవాలు , జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇక ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలో ఫ్రై మాదిరి చేసుకోవాలి. చివరలో పసుపు వేసి దానిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఈ పచ్చడిలో మీద పోయాలి. వేడి వేడి జామకాయ పచ్చడి సిద్ధం.