
కావాల్సిన పదార్ధాలు : 3 పాలకూర కట్టలు, 350 గ్రాములు పన్నీర్, ఒక ఉల్లిపాయ, 4 టమోటాలు, 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, నూనెను తీసుకోవాలి.

ముందుగా పాలకూరను కడిగి శుభ్రం చేసుకుని, వేడి నీటిలో 5 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో వేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు పాలకూరను తీసుకుని పచ్చిమిర్చి కలిపి మిక్సీలో కానీ రోటీలో కానీ మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ను వేసి గోల్డ్ రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే పోయే వరకు బాగా వేయించి, ఆ తర్వాత టమోటాలు వేసి, రుచికి తగినంత ఉప్పు బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు పసుపు, అర టీ స్పూన్ కారం, మసాలాలు వేసి బాగా కలపాలి.

పాలకూర పేస్ట్ ను పాన్ లో వేసి 5 నిమిషాలు బాగా ఉడికించాలి. చివర్లో పన్నీర్ ముక్కలను వేసి 2 నిమిషాలు ఉంచి కిందకు దించేయాలి. అంతే అంతే వేడి వేడి పాలక్ పన్నీరు కూర రెడీ.