ఎండు చేపలు మసాలా కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు

Updated on: Mar 08, 2026 | 8:59 PM

ఎండు చేపల కూరను బోర్ కొట్టకుండా చాలా మంది తింటారు. ఎందుకంటే, ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ఉండే బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు. ఇది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ముందుగా ఎండుచేపలను తీసుకుని వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉప్పు నీటితో బాగా కడిగి క్లీన్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ముందుగా ఎండుచేపలను తీసుకుని వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉప్పు నీటితో బాగా కడిగి క్లీన్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

2 / 5
ఇప్పుడు  గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక పాన్‌లో ఆయిల్ వేసి   కడిగి పెట్టుకున్న ఎండు చేపలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు  గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక పాన్‌లో ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న ఎండు చేపలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
అదే పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

అదే పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

4 / 5
ఎండు చేపలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక  కప్పు చింతపండు పులుసు బాగా ఉడికించాలి.

ఎండు చేపలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు చింతపండు పులుసు బాగా ఉడికించాలి.

5 / 5
 కూర గ్రేవీ లాగా మారిన తర్వాత దానిలో వేయించిన ఎండు చేపలు, గరం మసాలా పొడి వేసి స్టవ్ మీదే పది నిముషాలు ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

 కూర గ్రేవీ లాగా మారిన తర్వాత దానిలో వేయించిన ఎండు చేపలు, గరం మసాలా పొడి వేసి స్టవ్ మీదే పది నిముషాలు ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

Follow Us