
కావల్సిన పదార్దాలు: 150 గ్రాములు ఎండుచేపలు, బుడం దోసకాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, పసుపు కారం, మసాలా పొడిని తీసుకోవాలి.

ముందుగా ఎండుచేపలను నీటిలో నానబెట్టి, ఆ తర్వాత పసుపు నీటితో కడిగి బాగా శుభ్రం చేసి ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు బుడం దోసకాయలను తీసుకుని తొక్క తియ్యకుండా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి,కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి, తర్వాత దోసకాయ ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి.

దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వాటిలో ముందుగా క్లీన్ చేసిన ఎండుచేపలు, ఒక కప్పు చింతపండు రసం పోసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు మూత పెట్టి బుడం దోసకాయ, ఎండు చేపలు ఉడికేవరకు స్టవ్ మీదే ఉంచాలి. చివర్లో కొత్తిమీరను వేసి దించేయాలి. అంతే, బుడం దోసకాయ ఎండు చేపలు రెడీ.