
కావాల్సిన పదార్ధాలు : పావుకిలో అడవి దొండకాయలు , 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

ఆ తర్వాత అడవి దొండకాయలు ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు ను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ మీదే ఉంచండి.

ఇపుడు రొటీలో ధనియాలు, వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, నాలుగు ఎండుమిర్చి తో దొండకాయల మిశ్రమం కూడా వేసి 10 నిముషాల పాటు మగ్గనివ్వండి.

అంతే, వేడి వేడి అడవి దొండకాయల కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి.