పూర్వం ఇంట్లో గిన్నెలు తోమడానికి కొబ్బరి పీచులు, గడ్డి వంటివి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అవి దొరకడం కూడా కష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు అందరూ ఇంట్లో పాత్రలను క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉపయోగిస్తున్నారు.
వీటితో పాత్రలు తోమీ తోమీ అరిగి పోయాక మాత్రమే చెత్తలో పడేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వీటిని ఇలా వాడవచ్చా? ఎన్ని రోజులు స్క్రబ్బర్ మార్చాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు తెలుసా.. అసలు.. గిన్నెలు కడిగే స్క్రబ్బర్లో చాలా రకాల సూక్ష్మ జీవులు నివసిస్తాయి. మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువుల్లో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ కూడా ఒకటి. కానీ ఇది అస్సలు సేఫ్ కాదు.
చాలా మంది స్క్రబ్బర్స్తో గిన్నెలు శుభ్రం చేశాక.. వాడిని అస్సలు క్లీన్ కూడా చేయరు. కానీ స్క్రబ్బర్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఉప్పు వేసి వేడి నీటిలో ఉంచాలి. లేదంటే స్క్రబ్బర్ని వారం రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు.
ఈ స్క్రబ్బర్ వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం రెండు రోజులకు ఒక సారైనా వేడి నీటితో క్లీన్ చేసుకోవడం ముఖ్యం. కొద్దిగా వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి కరిగించాలి. ఇందులో స్క్రబ్బర్ని పది నిమిషాలు ఉంచి తీసేయాలి.