
టూర్ ప్యాకేజీ పేరు.. ఐఆర్సీటీసీ అందిస్తున్న నేపాల్ టూర్ ప్యాకేజీ పేరు నేచురల్లీ నేపాల్. ఈ ప్యాకేజీలో ఖాట్మాండు, పొఖారా ప్రాంతాలను చుట్టి రావొచ్చు. ప్రయాణికులను విమానంలో తీసుకెళ్లి తీసుకొస్తారు.

ప్యాకేజీలో ఏముంటాయి.. ఈ నేపాల్ టూర్ ప్యాకేజీలో వివరాలు పరిశీలిస్తే, ప్యాకేజీలో ప్రయాణికులకు ఉచితి వసతి, ఆహార ఏర్పాట్లు ఉంటాయి. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు నేపాల్లో మీరు ప్రయాణిస్తారు. అక్కడి వసతి, ఆహారం ప్యాకేజీలో కవర్ అవుతాయి.

ప్రయాణ తేదీ.. ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 24న ముగుస్తుంది. టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు ఉచిత అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది.

ప్యాకేజీ ధరలు.. ఈ టూర్ ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.55,100 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.47,000 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ముగ్గురితో కలిసి ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.46,200 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

పిల్లలకు టికెట్ ధరలు.. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలతో ఒక పడక సదుపాయం ఉన్న టూర్ ప్యాకేజీలో ప్రయాణిస్తే, మీరు రూ. 44,600 చెల్లించాలి. కాగా, 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ లేకుండా ధర రూ.43,400 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు టికెట్ ధరలు.. 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు రూ.32,000 చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటకులు ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.