
ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసుకుని దానిలో నీరు వేసి ముద్దలు లేకుండా మిక్స్ అయ్యేలా దానిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించాలి. మీడియం మంటపైనే కొద్దిగా ఉంచాలి

మరుగుతున్న నీటిలో రాగి పిండిని వేసి ఒక స్పూన్ తో బాగా కలుపుతూ ఉండాలి. అయితే, ఈ రాగి మిశ్రమం ఉండలుగా ఉండకుండా జాగ్రత్తగా కలపాలి. ఇలాగే, 10 నిముషాల పాటు బాగా ఉడికించాలి.

మరుగుతున్న నీటిలో రాగి పిండిని వేసి ఒక స్పూన్ తో బాగా కలుపుతూ ఉండాలి. అయితే, ఈ రాగి మిశ్రమం ఉండలుగా ఉండకుండా జాగ్రత్తగా కలపాలి. ఇలాగే, 10 నిముషాల పాటు బాగా ఉడికించాలి.

ఇంకా మీరు తియ్యగా తినాలనుకుంటే బెల్లం లేదా పంచదారను కూడా కలపాలి. అలాగే, ఒక గ్లాస్ పాలు కూడా కలిపితే మరింత టేస్టీగా ఉంటుంది. వేసవికాలంలో దీన్ని తాగితే చలువ చేస్తుంది

పిల్లలు నుంచి పెద్దల వరకు ఇది సమ్మర్లో సూపర్ ఫుడ్. అలాగే ఇది ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అంతేకాదు, ఎముకలు బలపడటానికి రాగి జావ చాలా మంచిది.