
గత కొంత కాలంగా పైల్స్ సమస్య వృద్ధుల్లోనే కాదు, ఇటీవల యువతలో కూడా ఎక్కువైంది. అయితే చాలా మంది ఈ వ్యాధి గురించి అస్సలు ఆందోళన చెందరు. అయితే కొందరు ఎక్కువగా బయట భోజనం చేయడం, రాత్రంతా మేలుకోవడం, తక్కువ నీరు తాగడం వల్ల శరీరంపై ప్రభావం చూపిస్తూ చెప్పలేనంత బాధపడాల్సి వస్తుంది.

సరిగ్గా తినకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోయినా మలబద్ధకం ఏర్పడుతుంది. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న బయటి ఆహారాన్ని తినడం వలన ఫైల్స్ ఏర్పడవచ్చు. తినే ఆహారంలో ఎక్కువ భాగం మాంసం ఉన్నా ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

అయినప్పటికీ దీర్ఘకాలిక మలబద్ధకం, దీర్ఘకాలిక విరేచనాలు, ప్రేగు కదలికల సమయంలో టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వంటి అంశాలు పైల్స్ వలన వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే తక్కువ ఫైబర్ తీసుకోవడం, వ్యాధులు, కుటుంబ చరిత్ర ఈ సమస్య మరింత ప్రమాదాన్ని పెంచుతుంది.

పైల్స్ కోసం తీసుకునే చికిత్సలో త్రిఫల చూర్ణం ధన్వంతరి వంటిది. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రిపూట తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా తీసుకుంటే పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆలు బుఖరా పైల్స్ నుండి సులభంగా విముక్తినిస్తాయి. ఈ పండ్లను తినే ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం మర్చిపోవద్దు. మరోవైపు నొప్పి ఉన్న చోట నిమ్మరసాన్ని పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

రోజూ వేడి నీళ్లలో స్నానం చేస్తే పైల్స్ నొప్పి తగ్గుతుంది. ఐతే ఈ సమస్యతో బాధపడేవారు వేడి నీళ్లతో స్నానం చేయడం వలన వాత, వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చండి. ఫైబర్ అధికంగా తీసుకోవడం వలన పైల్స్ ను నివారిస్తుంది. రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్లాసు పాలు తాగండి. అన్నానికి బదులు రొట్టెలను తినడం వలన మంచిది.

పైల్స్ సమస్యను పరిష్కరించడానికి రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. పొగాకు, కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండండి. అంతేకాదు రోజులో ఎక్కువగా నీరు తాగండి.. పండ్లు ఎక్కువగా తినండి. రాత్రిపూట కారంగా ఉండే ఆహారాన్ని తినండి. రోజులో ఒక గిన్నె బొప్పాయి. పప్పు మాత్రమే తినండి