
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు వాటి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ ఏడాది గురు పౌర్ణమి 2026, జూలై 29 న వచ్చింది. మీనరాశిలో వచ్చే పౌర్ణమి శక్తివంతమైన ఆధ్యాత్మికతతో పాటు మనిషి ముందుకు వెళ్ళడానికి ఈ శక్తి హెల్ప్ చేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురు పూర్ణిమ అంటే విద్య నేర్పించిన గురువులను గౌరవించడం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం. ఈ సమయంలో రెండు రాశుల వారికి మేలు కలగనుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారిపై లక్ష్మి దేవి వరాలు కురిపించబోతోంది. మొత్తం వీరికి నచినట్టుగానే మారుతుంది. ఈ గురు పూర్ణిమ నుంచి డబ్బులు బాగా సంపాదిస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం. అలాగే, ఆర్థిక సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఏ పని చేసిన ఆ పని విజయవంతం అవుతుంది.

మేష రాశి : ఈ గురు పూర్ణిమ రోజున వీళ్లు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు మొత్తం చక చకా జరిగిపోతాయి. ఇంకా మీరు అనుకున్న కలల జాబ్ కూడా వస్తుంది. జీవితంలో పడిన కష్టాలక వీరి మీద కనక వర్షం కురుస్తుంది. దెబ్బకు అప్పులు మొత్తం పోతాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.