అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు వేద మంత్రాలు, మంగళ వాయుద్యాల మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం.. ప్రధాని మోదీ సమర్పించారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు వేద మంత్రాలు, మంగళ వాయుద్యాల మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం.. ప్రధాని మోదీ సమర్పించారు.
అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట నిర్వహించిన.. బాల రాముడి సుందర రూపాన్ని దర్శించిన భక్తులు పరవశించిపోతున్నారు. సోషల్ మీడియాలో విడుదలైన బాల రాముడి ఫోటోలను చూసి భక్తులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడికి ప్రధాని మోదీ మొదటి హారతి సమర్పించారు. ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంది.
ఇక, ఆ బాల రాముడి రూపం.. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి.. చిరు దరహాసం, ప్రసన్నవదనంతో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. 5 ఏళ్ల వయసు ఉన్న బాలుడి రూపంలో నిండైన ముఖంతో అమాయకంగా చిరు నవ్వుతో ఉన్న బాల రాముడిని చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఆ బాల రాముడిని చూసి ప్రత్యక్షంగా చూసినవారే కాకుండా టీవీల్లో ప్రపంచ వ్యాప్తంగా చూసిన భక్తులు పరవశించిపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాదు.. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. దాదాపు బాలీవుడ్ నటీనటులందరూ హాజరయ్యారు. ఈ వేడుకకు కంగనా రనౌత్ కూడా హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్ (ఇప్పుడు X) ఖాతాలో రామ్ లల్లా విగ్రహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అయోధ్య రామమందిర వైభవం భక్తులను మైమరపింప జేస్తోంది.. భవిష్యత్తులో అయోధ్య దేశానికి యాత్రికులకు ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవిస్తుందని విశ్వసిస్తున్నారు.