
మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. అంబానీ కుటుంబానికి చెందిన కోడలు నీతా అంబానీ ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె వరకు స్టార్ కిడ్స్ అందరూ ఈ స్కూల్లోనే చదువుతున్నారు. కరణ్ జోహార్ కుమారుడు, కుమార్తె, షాహిద్ కపూర్ కుమారుడు, కరీనా కపూర్ ఇద్దరు కుమారులు కూడా ఈ పాఠశాల విద్యార్థులే.

ఈ స్కూల్లో చదవాలంటే చాలా లక్షల డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలకు నెల జీతం దాదాపు లక్షన్నర రూపాయలు. మరైతే ఈ స్కూల్లో చదువు చెప్పే టీచర్ల నెల జీతం ఎంత ఉంటుందో? ఇక్కడ టీచర్ వృత్తి చేపట్టాలంటే ఏ అర్హతలుండాలి? అనే సందేహం చాలా మందికి ఉన్నాయి. ఆ సమాచారం మీకోసం అందిస్తున్నాం..

ఏ స్కూల్లో అయినా టీచర్గా పనిచేయాలంటే బీ-ఎడ్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలన్న సంగతి తెలిసిందే. కానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మాత్రం టీచర్గా చేరాలంటే 'ఫ్రెషర్'కి అవకాశం ఉండదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఇక జీతం విషయానికొస్తే ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్లకు నెలకు 2 లక్షల నుంచి 7 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. టీచింగ్ అనుభవం బట్టి జీతభత్యాలు ఆధారపడి ఉంటుంది.

ఈ స్కూల్లో విద్యార్ధులకు కేవలం బోధన మాత్రమే సరిపోదు. విద్యార్థులకు స్పెషల్ యాక్టివిటీ క్లాసులు కూడా తీసుకుంటారు.