ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు అంతాఇంతాకాదు. అయితే చాలా మందికి పండ్లతో ఇంట్లో జ్యూసర్ మిక్సర్ ఉన్నా.. దానితో జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలియదు. ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ముందుగా తాజా పండ్లను తీసుకుని, వాటిని నీళ్లతో శుభ్రంగా కడగాలి. రసం తీసే జ్యూసర్ మరీ వేడిగా ఉండకూడదు. మిక్సర్ అధిక ఉష్ణోగ్రత పండ్లు, కూరగాయల పోషక విలువలను నాశనం చేస్తుంది. పండ్లు లేదా కూరగాయల రసం చేయడానికి ముందు, వాటి నుంచి విత్తనాలను తొలగించుకోవాలి. లేదంటే రసంలో కలిసిపోయి చేదుగా మారుతుంది.
జ్యూస్లో ఇది సహజ చక్కెర ఉంటుంది. ఇది మన శరీరానికి సరిపోతుంది కాబట్టి ఫ్రూట్ జ్యూస్ లేదా వెజిటబుల్ జ్యూస్లో అదనంగా చక్కెర కలుపుకోవల్సిన అవసరం లేదు.
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పానీయం ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని సులభంగా నాశనం చేస్తుంది. అలాగే రోజంతా తరచుగా నీళ్లు తాగుతుండాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. జీలకర్రకు బదులుగా చియా గింజలు, తులసి గింజలు కూడా వినియోగించవచ్చు.
జ్యూస్ చేసే ముందు ఎల్లప్పుడూ పండ్లు లేదా కూరగాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని జ్యూసర్లోసి జ్యూస్ పట్టుకుంటే రసం బాగా వస్తుంది.