
అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం చోటు చేసుకుంది. నేడు (మంగళ వారం, నవంబర్ 25న) అయోధ్యలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయినందకు చిహ్నంగా ఆలయ శిఖరంపై మోదీ ధ్వజారోహణం చేయడం జరిగింది.

యూపీలో అయోధ్య రామాయలంలో మరోసారి అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువుదీరిన ఆలయంలో, నేడు ఘనంగా ధ్వజరారోహణ చేశారు. గర్భ గుడిపై కాషాయ రంగు ధర్మ ధ్వజాన్ని పీఎం మోదీ ఎగురవేశారు.

ధ్వజారోహణ కార్యక్రమంలో అయోధ్య మందిర నిర్మాణ ప్రక్రియ పరిపూర్ణం అయింది. అందుకే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నాటి ఉత్సాహం, భక్తిభావన కనిపిస్తున్నాయి. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణం చేశారు ప్రధాని మోదీ.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు, RSS చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అయోధ్య ఆలయశిఖరంపై ధర్మధ్వజం ఇప్పుడు విరాజిల్లుతోంది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని శ్రీరామజన్మభూమి ఆలయం మళ్లీ విరాజిల్లుతోంది.

ప్రధాని మోదీ ఇవాళ్టి అయోధ్యటూర్ మళ్లీ హైలైట్ అవుతోంది. అయోధ్య రామాలయ కంప్లెక్స్లో పలు దేవాలయాలను దర్శించి పూజలు చేశారాయన. ఆ తర్వాత RSS సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్తో కలిసి, తొలి అంతస్తులోని రామదర్బార్లో పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు.