
మల్లెపూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే మహిళలు మల్లెపూలను ఎక్కువగా ఇష్టపడతుంటారు. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఎక్కువగా మల్లెపూలు పెట్టుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. అయితే మల్లెపూలు జుట్టు అందాన్ని పెంచడమే కాకుండా వీటితో ముఖసౌందర్యం కూడా పెరిగే ఛాన్స్ ఉన్నదంట. అది ఎలానో ఇప్పుడు మీరే చూసెయ్యండి.

మల్లెపూలు చెట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది.ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడే పూలలో ఇవే ముందుంటాయి. ఇక ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మల్లెపూలు ఉండాల్సిందే. అయితే చాలా మంది వీటిని కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ మల్లెపూలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఫేస్ గ్లో పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందంట. మల్లెపూలను నీటిలో వేసి, ఆ నీళ్లను ఫేస్కు అప్లై చేయడం వలన ముఖం మిల మిల మెరిసిపోతుందంట. ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మం కాంతి వంతంగా మెరిసేలా చేస్తాయంట.

మల్లెపూల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించి, ఒత్తిడిన తగ్గిస్తాయి. అంతే కాకుండా ముడతలు, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయంట. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయంట.

మల్లెపూల నీటిని ముఖానికి అప్లై చేయడం వలన ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా, స్మూత్గా చేస్తుందంట. అలాగే చర్మ రంగును కూడా మార్చుతుందంట. అందువలన డల్ స్కిన్ తో బాధపడే వారు ప్రతి రోజూ ముఖానికి జాన్మిన్ వాటర్ అప్లై చేయడం చాలా మంచిదంటున్నారు నిపుణులు.