
అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. సాధారణంగా అధికంగా ఉప్పు తింటే బీపీ పెరిగి కిడ్నీలు ఫెయిలవడం చూస్తూ ఉంటాం. అయితే అధికంగా షుగర్ తినడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటున్నాయని ఇటీవల నిపుణులు గుర్తించారు.

చక్కెర అతిగా తీసుకోవడం వల్ల పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్(PKD) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ స్టడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు 12 మిలియన్ల మందికి ఈ వ్యాధి శోకిందని చెబుతోంది. ఇది సోకితే నయం చేయడం కష్టమని, కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే చక్కెరస్థాయిలను మూత్ర పిండాలు అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా తిత్తులు ఉబ్బినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాల్లో చక్కెర స్వీకరణ నిరోధించే మందుల్ని ఉపయోగించినప్పుడు దాని వాపుని అది తగ్గించిందని వివరించారు.

దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వచ్చిందంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. పీకేడీ సోకిన వ్యక్తులు కాలేయం వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.