గోరువెచ్చని నీరుతో ఎంతో ప్రయోజనం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయం అందరికి తెలియకపోవచ్చు. ఈ నీరు తాగాలని వైద్య నిపుణులు కూడా సిఫార్స్ చేస్తుంటారు.
వేసవిని పరిగణలోకి తీసుకుంటే గోరువెచ్చని నీటితో దాహం తీర్చడం అసాధ్యం అనిపిస్తుంది. మలబద్దకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. రక్తనాళాలకు విస్తరిస్తుంది. రక్తప్రసరణ మెరుగు పర్చేలా చేస్తుంది. ఇది కండరాలు నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
కండరాలు, లేదా కండరాల నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. 2003లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనానికి ముందు 500 మి.లీ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ 30 శాతం మెరుగు పడుతుందని పరిశోధకులు గుర్తించారు.
గోరువెచ్చని నీటి వల్ల సాధారణ ఫ్లూ, జలుబుతో పోరాడుతుంది. సైనస్ సమస్యలతో బాధపడేవారికి ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. వేసవిలో ఈ గోరువెచ్చని నీరు తాగడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఏడాది పొడవున ఈ నీరు తాగే అలవాటున్న వారికి సులభంగా అనిపిస్తుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వలన జీవక్రియ బలపడుతుంది. అంతేకాకుండా.. శరీరంలో కొవ్వును బర్న్ చేస్తుంది. రక్తప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎక్కువగా సహయపడుతుంది.