
తన చందాదారుకలు ఈపీఎఫ్లో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ‘ఈపీఎఫ్ఓ 3.0’ పేరుతో ఈ అప్గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులను కూడా ఈపీఎఫ్వో విధించింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వలో కేవలం 50 శాతం వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. అత్యవసర సమయాల్లో కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్షణమే నగదు పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు తమ యూఏఎన్ (UAN) నంబర్ను యాక్టివ్గా ఉంచుకోవాలని ఈపీఎఫ్వో వర్గాలు చెబుతున్నాయి. అలాగే బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసి ఉండడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకునే అవకాశం లభిస్తుంది.

గతంలో పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సామాన్య ఉద్యోగులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే యూపీఐ ఆప్షన్ను కూడా ఇందులో చేర్చారు.

ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వేతన జీవులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ ఏటీఎం కార్డులు సంజీవనిలా పనిచేస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పారదర్శకతను పెంచుతూనే వేగంగా సేవలు అందించడంలో ఈపీఎఫ్ఓ 3.0 కీలక పాత్ర పోషించనుంది. మే నెల తర్వాత పీఎఫ్ నగదు విత్ డ్రా ప్రక్రియ పూర్తిగా మారిపోనుంది.