
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అలా మారినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. మార్చి నెలలో బుధుడితో పాటు బృహస్పతి గ్రహం సంచారం చేయనున్నాయి.

ఈ రెండు గ్రహాలు శక్తివంతమైనవిగా చెబుతుంటారు. అయితే, ఇవి కలిసినప్పుడు నవ పంచమి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన మూడు రాశుల వారు జీవితం మారడంతో పాటు, లాభాలు పొందనున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మేష రాశి : నవ పంచమి రాజయోగం వలన మేష రాశి వారు అన్ని రకాలుగా లాభ పడనున్నారు. ముఖ్యంగా, మీరు గతంలో పోగోట్టుకున్నవన్ని పొందనున్నారు. అంతేకాకుండా, కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి ఇది మంచి సమయం. కొత్తగా జాబ్ లో జాయిన్ అయినా వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

మిథున రాశి : నవ పంచమి రాజయోగం వలన మిథున రాశి వారికి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. అంతేకాదు, ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డన్ డేస్ మొదలు కానున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరనుంది.

సింహరాశి : నవ పంచమి రాజయోగం వలన సింహరాశి వారికి సానుకూలంగా ఉండనుంది. పెండింగ్ పనులన్ని పూర్తవుతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. అంతేకాదు, పెద్ద మొత్తంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి.