
ఖర్జూరం ఒక పోషకాహార శక్తి వనరు. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరిత శక్తి వనరుగా పనిచేస్తాయి. వాటి స్వాభావిక తీపిని మించి, ఈ పండ్లు సమతుల్య రక్తపోటును నిర్వహించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మొత్తం జీవశక్తిని పెంచడంలో పాత్ర పోషిస్తాయి. చూసేందుకు ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం. శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని ఇది బాగా పెంచుతుంది. అంతేకాదు మన శరీరంలోని క్షీణించిన కణజాలాలను తిరిగి రిపేర్ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ఖర్జూరాలను తినడం వల్ల మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి, సమతుల్య మానసిక స్థితి, మంచి నిద్ర కలుగుతాయి.

ఖర్జూరంలోని సహజ చక్కెరలు నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి స్థిరమైన శక్తిని అందిస్తాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలు త్వరగా శక్తిని అందిస్తాయి. అయితే, ఖర్జూరం నుండి శక్తిని పెంచడం ఈ పండ్లలో ఫైబర్ ఉండటం. ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఖర్జూరం సులభంగా జీర్ణమవుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఈ పండ్లలో ఫైబర్ కూడా మంచి శక్తిని అందిస్తుంది.

నెయ్యిలో ఉండే ఎంజైమ్ల వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో సహా, పలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తాయి.

ముఖ్యంగా వీటిలో బి-కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్-కె, విటమిన్-ఏ, ఐరన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం లాంటి ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. ఖర్జూరం తినడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, రొమ్ము క్యాన్సర్, మలబద్ధకం లాంటి సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన దంతాలకు, చిగుళ్ల పరిరక్షణకు కూడా ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలను నెయ్యితో కలపడం వల్ల దాని శక్తిరెట్టింపు అవుతుంది.