
సాయంత్రం పూట వేడి టీతో తోటకూర పకోడీ తింటే అబ్బబ్బా అంటూ వదలకుండా మూడు నాలుగు ఫ్లేట్స్ తింటారు. ఇంకా ఇవి బయట కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్స్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి బాగా నచ్చుతుంది. మరి, ముఖ్యంగా వానలు పడేటప్పుడు ఈ పకోడీలు తింటే సూపర్ సూపరు.

ఇంకా తోటకూరలో కాల్షియం, ఫైబర్, ఐరన్ ఇలా మనిషికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉండటంతో ఈ పకోడీలు మంచిగా ఉంటాయి. ఇంకా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా ఆకులతో పకోడీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి రుచితో పాటు దీనిలో మనకి కావాల్సిన విటమిన్లు కూడా ఉంటాయి.

తోటకూర పకోడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల తోటకూర ఆకులు, ఒక కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి, ఒక ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ పేస్ట్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, నూనెను తీసుకోవాలి.

తోటకూరను మట్టి పోయే వరకు బాగా కడిగి తరిగి పెట్టుకోవాలి. అయితే దీనిలో నీరు ఉంటే పకోడీలు క్రిస్పీగా సరిగా రావు. ఆ తరవాత తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కరివేపాకు, కప్పు శెనగపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి నీళ్లతో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చేయాలి.

చివర్లో చిటికెడు బేకింగ్ సోడాను కలుపుకోవాలి. ఇంకా పకోడీలు క్రిస్పీగా వస్తాయి.ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక దీనిలో ముద్దల ముద్దలుగా నూనెలో వేయాలి. బంగారు కలర్లోకి మారే వరకు వేయించాలి. బాగా కాలిన తరవాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి తోటకూర పకోడీ రెడీ. సాయంత్రం పూట ఇదే పర్ఫెక్ట్