స్మృతి మందాన: ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.
దీప్తి శర్మ: ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.
జెమీమా రోడ్రిగ్జ్: టీ20 వరల్డ్కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
షెఫాలీ వర్మ: తుఫాన్ బ్యాటింగ్కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.
పూజా వస్త్రాకర్: ఈ టీమిండియా ఆల్రౌండర్ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.
అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్సీబీ), హార్మన్ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.