
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో 47వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్తో ఆంటిగ్వా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

ఈ 196 పరుగుల్లో టీమిండియా బ్యాటర్లు కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 13గా నిలిచింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ తలా 1 సిక్స్ కొట్టగా, రిషబ్ పంత్ 2 సిక్సర్లు బాదారు. విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా తలా 3 సిక్సర్లు బాదారు. దీంతో టీమిండియా బ్యాటర్లు మొత్తం 13 సిక్సర్లు కొట్టారు.

ఈ పదమూడు సిక్సర్లతో టీమిండియా తన పాత రికార్డును చెరిపేసుకుంది. అంటే, గతంలో టీ20 ప్రపంచకప్లో భారత జట్టు 11 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించింది.

2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై భారత జట్టు మొత్తం 11 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును లిఖించింది. ఈసారి యువరాజ్ సింగ్ ఒక్కడే 7 సిక్సర్లు కొట్టాడు. టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు టీమిండియా రికార్డు ఇదే.

బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మొత్తం 13 సిక్సర్లు కొట్టారు. దీంతో 2007లో నెలకొల్పిన రికార్డును 17 ఏళ్ల తర్వాత టీమిండియా బ్యాటర్లు చెరిపేశారు.