ఆ యువ ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే.! బీసీసీఐ వార్నింగ్ సిగ్నల్స్.. కాపాడటానికి ధోని కూడా లేడుగా.!

|

Feb 26, 2024 | 10:57 AM

బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్‌ను కనుసైగతో శాసిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐసీసీకి మన బీసీసీఐ ఏం చెబితే అదే శాసనం. అంతటి సత్తా ఉన్న ఈ క్రికెట్ బోర్డుతో ఎవ్వరు పెట్టుకున్నా.. పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే.

1 / 5
 బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్‌ను కనుసైగతో శాసిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐసీసీకి మన బీసీసీఐ ఏం చెబితే అదే శాసనం. అంతటి సత్తా ఉన్న ఈ క్రికెట్ బోర్డుతో ఎవ్వరు పెట్టుకున్నా.. పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే. అదే క్రికెటర్ల వంతు వస్తే.. కచ్చితంగా వారి కెరీర్లు ఖతం అయినట్టే. ఇప్పుడు ఓ ఇద్దరు యువ క్రికెటర్ల పరిస్థితి అదే అయింది. బీసీసీఐ మాటను ధిక్కరించిన టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు తమ కెరీర్లను డేంజర్‌లో పడేసుకున్నారు. వీళ్లకి గట్టి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. 

బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్‌ను కనుసైగతో శాసిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐసీసీకి మన బీసీసీఐ ఏం చెబితే అదే శాసనం. అంతటి సత్తా ఉన్న ఈ క్రికెట్ బోర్డుతో ఎవ్వరు పెట్టుకున్నా.. పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే. అదే క్రికెటర్ల వంతు వస్తే.. కచ్చితంగా వారి కెరీర్లు ఖతం అయినట్టే. ఇప్పుడు ఓ ఇద్దరు యువ క్రికెటర్ల పరిస్థితి అదే అయింది. బీసీసీఐ మాటను ధిక్కరించిన టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు తమ కెరీర్లను డేంజర్‌లో పడేసుకున్నారు. వీళ్లకి గట్టి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. 

2 / 5
టీమిండియాలోకి తిరిగి రావాలంటే.. కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ పెద్దల మాట. అయితే ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్. రంజీల్లో ఆడకుండా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. దీంతో తమ మాట భేఖాతర్ చేసినందుకు గానూ అయ్యర్, కిషన్ సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఇప్పటికే బోర్డు పెద్దలు సమాలోచనలు చేయడం, తొలగింపునకు సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే రానుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ వీళ్లిద్దరికి సెంట్రల్ కాంట్రాక్టులు రాకపోతే.. ఇక టీమిండియాకు ఆడేందుకు అనర్హులే. దీంతో టీమిండియాలో ఇక ఇషాన్, అయ్యర్ కెరీర్ క్లోజ్ అయినట్టే.  

టీమిండియాలోకి తిరిగి రావాలంటే.. కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ పెద్దల మాట. అయితే ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్. రంజీల్లో ఆడకుండా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. దీంతో తమ మాట భేఖాతర్ చేసినందుకు గానూ అయ్యర్, కిషన్ సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఇప్పటికే బోర్డు పెద్దలు సమాలోచనలు చేయడం, తొలగింపునకు సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే రానుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ వీళ్లిద్దరికి సెంట్రల్ కాంట్రాక్టులు రాకపోతే.. ఇక టీమిండియాకు ఆడేందుకు అనర్హులే. దీంతో టీమిండియాలో ఇక ఇషాన్, అయ్యర్ కెరీర్ క్లోజ్ అయినట్టే.  

3 / 5
సఫారీ టూర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న కిషన్‌ను.. పునరాగమనం చేసేందుకు రంజీలు ఆడాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచించాడు. అయితే మనోడు ఇగో చూపించి.. ఆ మాటను కాస్తా పెడచెవిన పెట్టాడు. ఇక అక్కడ నుంచి మొదలైన వివాదం.. బోర్డు వరకు చేరింది. జైషా లైన్‌లోకి వచ్చినా.. ఇషాన్ ధిక్కరించడంతో పీక్స్‌కు చేరింది. టీమిండియాకి దూరంగా ఉన్నవారు, జట్టులో స్థానం దక్కించుకోని వారు తిరిగి పునరాగమనం చేయాలంటే.. డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది.  

సఫారీ టూర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న కిషన్‌ను.. పునరాగమనం చేసేందుకు రంజీలు ఆడాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచించాడు. అయితే మనోడు ఇగో చూపించి.. ఆ మాటను కాస్తా పెడచెవిన పెట్టాడు. ఇక అక్కడ నుంచి మొదలైన వివాదం.. బోర్డు వరకు చేరింది. జైషా లైన్‌లోకి వచ్చినా.. ఇషాన్ ధిక్కరించడంతో పీక్స్‌కు చేరింది. టీమిండియాకి దూరంగా ఉన్నవారు, జట్టులో స్థానం దక్కించుకోని వారు తిరిగి పునరాగమనం చేయాలంటే.. డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది.  

4 / 5
ఇక ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు చోటు సంపాదించలేకపోయినా శ్రేయాస్ అయ్యర్.. గాయం అయ్యిందన్న సాకుతో రంజీల్లో ఆడకుండా తప్పుకున్నాడు. అయితే ఎన్‌సీఏ కీలక అధికారి ఒకరు 'శ్రేయాస్ అయ్యర్‌కు ఎలాంటి గాయం కాలేదని.. పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు'.

ఇక ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు చోటు సంపాదించలేకపోయినా శ్రేయాస్ అయ్యర్.. గాయం అయ్యిందన్న సాకుతో రంజీల్లో ఆడకుండా తప్పుకున్నాడు. అయితే ఎన్‌సీఏ కీలక అధికారి ఒకరు 'శ్రేయాస్ అయ్యర్‌కు ఎలాంటి గాయం కాలేదని.. పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు'.

5 / 5
ఇలా ఈ ప్రకటన వెలువడిందో లేదో.. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతూ కనిపించాడు. అటు ఇషాన్ కిషన్ కూడా అతడికి తోడుగా వర్కౌట్లు చేస్తూ, హార్దిక్ పాండ్యాతో తిరుగుతూ కనిపించాడు. దీంతో సిరీస్ అయిన బీసీసీఐ.. వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్స్ తొలగించేందుకు సిద్ధమైంది. ఒకవేళ అదే జరిగితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే మొదటి సెన్సేషనల్ న్యూస్ కావచ్చు. 

ఇలా ఈ ప్రకటన వెలువడిందో లేదో.. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతూ కనిపించాడు. అటు ఇషాన్ కిషన్ కూడా అతడికి తోడుగా వర్కౌట్లు చేస్తూ, హార్దిక్ పాండ్యాతో తిరుగుతూ కనిపించాడు. దీంతో సిరీస్ అయిన బీసీసీఐ.. వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్స్ తొలగించేందుకు సిద్ధమైంది. ఒకవేళ అదే జరిగితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే మొదటి సెన్సేషనల్ న్యూస్ కావచ్చు.