
పాక్పై 82 పరుగులు చేసిన ఇషాన్.. తొలి 17 వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ తన 17 వన్డే ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఇషాన్ పేరిట ఓ డబుల్ సెంచరీ (బంగ్లాపై 210) కూడా ఉంది.

అయితే విరాట్ కోహ్లీ తన తొలి 17 ఇన్నింగ్స్ల్లో 757 పరుగులే చేశాడు. తద్వారా ఇషాన్ తన తొలి 17 ఇన్నింగ్స్లో కోహ్లీ కంటే 19 పరుగులు ఎక్కువ చేసి రెండో స్థానానికి చేరుకోగా, విరాట్ మూడో స్థానానికి దిగాడు.

ఈ లిస్టు నాల్గో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. అయ్యర్ తన తొలి 17 వన్డే ఇన్నింగ్స్ల్లో 750 పరుగులు చేశాడు.

ఇక ఈ లిస్టు అగ్రస్థానంలో శుభమాన్ గిల్ ఉన్నాడు. గిల్ తన తొలి 17 ఇన్నింగ్స్ల్లో 778 పరుగులు చేశాడు. ఇందులో అతను న్యూజిలాండ్పై చేసిన 208 పరుగుల డబుల్ సెంచరీ కూడా ఉంది.

కాగా, తొలి 17 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఈ టాప్ 4 ప్లేయర్ల లిస్టులో ఇషాన్ కిషన్ మాత్రమే 105+ స్ట్రేక్ రేట్కి కలిగి ఉండడం విశేషం.