ఐపీఎల్ రెండో ఫేజ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్కు సమీకరణాలు మారుతున్నాయి.
కోహ్లిసేన వరుస ఓటములను నమోదు చేసుకుంటే.. ధోనిసేన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. నిన్న జరిగిన చెన్నై, బెంగళూరు మ్యాచ్ తర్వాత పాయింట్స్ పట్టిక ఇలా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్స్తో అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్స్తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 10 పాయింట్స్, కోల్కతా 8 పాయింట్స్తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఆరెంజ్ క్యాప్: శిఖర్ ధావన్(422) అగ్రస్థానంలో.. కెఎల్ రాహుల్(380) రెండో స్థానంలో.. డుప్లెసిస్(351), మయాంక్ అగర్వాల్(327), రుతురాజ్ గైక్వాడ్(322)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(17 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(14 వికెట్లు) రెండు, క్రిస్ మోరిస్(14 వికెట్లు), అర్ష్దీప్ సింగ్(12 వికెట్లు), రషీద్ ఖాన్(11 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.