IPL 2023: ఐపీఎల్ చరిత్రలో నలుగురే.. 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్లు వీరే..

|

Apr 18, 2023 | 3:58 PM

భాగ్యనగరం వేదికగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమ్ ఇన్నింగ్స్ ముగిసిపోవడంతో ధానవ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

1 / 7
భాగ్యనగరం వేదికగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమ్ ఇన్నింగ్స్ ముగిసిపోవడంతో ధానవ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

భాగ్యనగరం వేదికగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమ్ ఇన్నింగ్స్ ముగిసిపోవడంతో ధానవ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

2 / 7
అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఇక పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి ఆ టీమ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఇక పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి ఆ టీమ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

3 / 7
ఫలితంగా ధావన్ ఓ అరుదైన లిస్టులో జాయిన్ అయ్యాడు. 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ఐపీఎల్ ప్లేయర్ల జాబితాలో ధావన్ చోటు సంపాదించుకున్నాడు. అయితే అతని కంటే ముందు ఈ లిస్టులో ముగ్గురు ప్లేయర్లే ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

ఫలితంగా ధావన్ ఓ అరుదైన లిస్టులో జాయిన్ అయ్యాడు. 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ఐపీఎల్ ప్లేయర్ల జాబితాలో ధావన్ చోటు సంపాదించుకున్నాడు. అయితే అతని కంటే ముందు ఈ లిస్టులో ముగ్గురు ప్లేయర్లే ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

4 / 7
‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి చెందిన సురేష్ రైనా.. టోర్నీ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అవును, 2013 ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై అజేయంగా 99  పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 223/3 పరుగులు చేసింది. అలాగే 77 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.

‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి చెందిన సురేష్ రైనా.. టోర్నీ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అవును, 2013 ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై అజేయంగా 99 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 223/3 పరుగులు చేసింది. అలాగే 77 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.

5 / 7
IPL 2019లో, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ తన మాజీ IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాటౌట్‌గా నిలిచాడు. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో  క్రిస్ గేల్ 64 బంతుల్లోనే  99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. దీంతో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా యూనివర్సల్ బాస్ నిలిచాడు.

IPL 2019లో, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ తన మాజీ IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాటౌట్‌గా నిలిచాడు. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 64 బంతుల్లోనే 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. దీంతో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా యూనివర్సల్ బాస్ నిలిచాడు.

6 / 7
క్రిస్ గేల్ 99(నాటౌట్) పరుగుల ఇన్నింగ్స్ తర్వాత రెండేళ్ల అనంతరం అదే పంజాబ్ కింగ్స్‌కు చెందిన మరో ఆటగాడు కూడా ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పుడు పంజాబ్ తరఫున ఆడుతున్న మయాంక్ అగర్వాల్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 58 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

క్రిస్ గేల్ 99(నాటౌట్) పరుగుల ఇన్నింగ్స్ తర్వాత రెండేళ్ల అనంతరం అదే పంజాబ్ కింగ్స్‌కు చెందిన మరో ఆటగాడు కూడా ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పుడు పంజాబ్ తరఫున ఆడుతున్న మయాంక్ అగర్వాల్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 58 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

7 / 7
తాజాగా  ఐపీఎల్ 2023,  సీజన్‌16లో శిఖర్ ధావన్‌కి కూడా అదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 66 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన నాల్గో ఆటగాడిగా గబ్బర్ ఐపీఎల్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు.

తాజాగా ఐపీఎల్ 2023, సీజన్‌16లో శిఖర్ ధావన్‌కి కూడా అదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 66 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన నాల్గో ఆటగాడిగా గబ్బర్ ఐపీఎల్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు.