
ASIA CUP 2022: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా కప్లో విజయంతో అరంగేట్రం చేశాడు. భారత్ ఈ విజయంలో రోహిత్ శర్మ సహకారం ప్రత్యేకంగా ఏం లేదు. 44 నిమిషాల ఇన్నింగ్స్లో అతను 18 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఈ 12 పరుగులే రోహిత్ను నంబర్వన్గా నిలబెట్టాయి.

అది ఎలా అని ఆలోచిస్తున్నారా? అక్కిడికే వస్తున్నాం. ఈ 12 పరుగుల కారణంగా, రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గప్టిల్ రికార్డును బద్దలు కొట్టాడు.

రోహిత్ శర్మ 133 మ్యాచ్ల్లో 125 ఇన్నింగ్స్ల్లో 3499 పరుగులు చేశాడు. అతను 4 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో దాదాపు 140 స్ట్రైక్ రేట్తో ఈ పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ పరుగులను కివీ ఓపెనర్ 121 మ్యాచ్లలో 2 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలతో దాదాపు 136 స్ట్రైక్ రేట్తో సాధించాడు.

ఈ జాబితాలో భారత్కు చెందిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 100 టీ20 మ్యాచ్లు ఆడి 3343 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 30 అర్ధ సెంచరీలు సాధించాడు. స్ట్రైక్ రేట్ 137 కంటే ఎక్కువగా ఉంది.