IND vs IRE: ఐర్లాండ్తో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బూమ్రా.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ టీ20 మ్యాచ్కి ముందు ఆ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండేవాడు.
70 టీ20 వికెట్లు తీసిన బూమ్రా దాదాపు 327 రోజుల పాటు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో హార్దిక్.. బూమ్రాను అధిగమించి మొత్తం 73 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అవతరించాడు.
అయితే గాయం నుంచి తిరిగొచ్చిన బూమ్రా.. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ 2, 2 వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 74 వికెట్లు తీసిన బూమ్రా.. హార్దిక్ని అధిగమించాడు. ఇంకా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు హార్దిక్ నాలుగో స్థానానికి దిగిపోయాడు.
కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ ఇప్పటివరకు 96 వికెట్లు పడగొట్టి ఈ రికార్డ్ సృష్టించాడు.
అలాగే చాహల్ తర్వాత భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. భువీ మొత్తంగా 90 టీ20 వికెట్లు తీశాడు.