
Asian Games 2023: ఆసియా క్రీడల్లో నేరుగా నేపాల్తో క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్న భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ చేసిన యశస్వీ.. భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీని నమోదు చేశాడు.

అంతకముందు భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ సూర్య కుమార్ యాదవ్ పేరిట ఉండేది, కానీ దాన్ని యశస్వీ తన సొంతం చేసుకున్నాడు. సూర్య 49 బంతుల్లో టీ20 సెంచరీ చేయగా.. యశస్వీ 48 బంతుల్లోనే సాధించాడు. ఇదే సెంచరీతో సూర్య పేరిట ఉన్న మరో రికార్డ్(48 బంతుల్లోనే టీ20 శతకం)ని కూడా యశస్వీ సమం చేశాడు.

కాగా, భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రోహిత్ శర్మ పేరటి ఉంది. రోహిత్ 2017లో 35 బంతుల్లోనే టీ20 సెంచరీ నమోదు చేశాడు.

రోహిత్ తర్వాత సూర్య 45 బంతుల సెంచరీ రెండో స్థానంలో.. కేఎల్ రాహుల్ 46 బాల్స్ సెంచరీ మూడో స్థానంలో ఉన్నాయి.

విశేషం ఏమిటంటే.. భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సూర్య పేరిటనే వేగవంతమైన 4వ శతకం(48), 6వ శతకం(49) ఉన్నాయి. అంటే ప్రస్తుతం భారత్ తరఫున ఫాస్టెస్ట్ 2వ, 4వ, 6వ టీ20 సెంచరీలు సూర్య పేరిటనే ఉన్నాయి.