
ఐపీఎల్ (IPL 2024) ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికులు రాబోయే 15 నెలలపాటు వినోదాన్ని అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో 15 రోజుల్లో మూడు టోర్నీలను నిర్వహిస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. యూఎస్ఏ-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. అంటే ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య జరుగుతుంది. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 10 జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని చూసే అవకాశం క్రికెట్ ప్రేమికులకు లభిస్తుంది.

అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ 2025 జూన్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్లో జరగనుంది. ఈ మూడు ఐసీసీ టోర్నీలు కేవలం 15 నెలల్లోనే జరగడం విశేషం.

ఐసీసీ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుని 10 ఏళ్లు పూర్తయ్యాయి. అంటే 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఏ ఐసీసీ టోర్నీని గెలవలేదు. కాబట్టి వచ్చే 15 నెలల్లో భారత జట్టు ఏ ట్రోఫీని అందుకుంటుందోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.