సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ 787 కానిస్టేబుల్, ట్రేడ్మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుషులకు 641 పోస్టులు, మహిళలకు 69, ఎక్స్సర్వీస్మెన్లకు 77 వరకు పోస్టులను కేటాయించనున్నారు.
పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు బార్బర్/బూట్మేకర్/కాబ్లర్/టైలర్/కుక్/మాసన్/మాలి/పెయింటర్/ప్లంబర్/వాషర్ మ్యాన్/వెల్డర్ విభాగాల్లో ఐటీఐ ట్రైన్డ్ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 20, 2022వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీ మీటర్లు, ఛాతీ 80-85 సెంటీ మీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకైతే ఎత్తు 157 సెంటీ మీటర్లు ఉండాలి.
ఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షకు 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున 2 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. దేశంలోని నార్తెర్న్, ఎన్సీఆర్, వెస్ట్రన్, సెంట్రల్, ఈస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్ట్రన్, నార్తెర్న్ ఈస్ట్రన్ రీజియన్లలో ఉద్యోగం కల్పిస్తారు.