
ఇండస్ట్రీలో పొలిటికల్ సీజన్ నడుస్తుందిప్పుడు. తెలంగాణ ఎన్నికలు అయిపోయినా.. ఏపీ ఎన్నిలపై ఫోకస్ చేస్తున్నారు దర్శకులు. తాజాగా యాత్ర 2తో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఎన్నికల కాన్సెప్ట్తోనే వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు యాత్ర సినిమాతో వచ్చిన మహి వి రాఘవ్.. 2024 ఎన్నికలకు ముందు యాత్ర 2తో రాబోతున్నారు.

మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను చూపించారు మహి. యాత్ర 2లో వైఎస్ జగన్ పాదయాత్రను చూపించబోతున్నారు మహి.

అలాగే వర్మ వ్యూహం అంటూ వైఎస్ జగన్కు సపోర్టుగా ఓ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ పూర్తైంది. డిసెంబర్ 29న విడుదల కానుంది వ్యూహం.

శపథం పేరుతో వ్యూహానికి సీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు వర్మ. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. పొలిటికల్ మూవీస్ కేటగిరీలో జగన్ వర్గమే కాస్త ముందుందనుకుంటే..

నారా రోహిత్ కూడా ప్రతినిథి 2తో వచ్చేస్తున్నారు. జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకుడు. వ్యూహం, శపథం, యాత్ర 2 ఓ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే.. మరో పార్టీ నుంచి ప్రతినిథి వస్తున్నాడు. మరి వీటిలో ఏది ఎలక్షన్ మూవెంట్ను క్యాష్ చేసుకుంటుందో చూడాలి.