
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది అందాల భామ ప్రియమణి. తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది

పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది.

తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే గతంలో ప్రియమణి తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడింది. ఆకామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణిపై పలువురు విమర్శలు గుప్పించారు. దీని పై ఆమె స్పందిస్తూ.. నా పిల్లలు ఉగ్రవాదులు అవుతారంటూ చేసిన వ్యాఖ్యలను చేశారు. మతంతో సంబంధం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. దాని మీద ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు.

నేను ఈద్ రోజున ఒక పోస్ట్ చేసాను. వెంటనే మీరు ఇస్లాంలోకి మారారా అని కామెంట్స్ చేస్తున్నారు. నేను మతం మారానని నీకు తెలుసా?.. ఏది ఏమైనా అది నా నిర్ణయం. పెళ్లికి ముందు నా భర్తతో ‘నేను హిందువుగా పుట్టాను, పుట్టాక నా విశ్వాసాన్ని పాటిస్తానని చెప్పాను’ అని తెలిపింది ప్రియమణి.