
కొన్ని సినిమాలు నెమ్మదిగా మొదలై చివరి సన్నివేశానికి చేరుకుంటాయి. ఇది అలాంటి సినిమాలలో ఒకటి ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రారంభంలో పెద్ద మలుపులేమీ ఉండవు.. కానీ ఒకానొక సమయంలో ఆ సినిమాలోని సస్పెన్స్, మలుపులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. పరిస్థితికి అనుగుణంగా మారాలన్న పాత్ర నిర్ణయం మొత్తం సినిమానే మార్చేస్తుంది. అది ఏ సినిమానో మీకు తెలుసా? ప్రస్తుతం తెగ వైరలవుతుంది. 'మనిషి తన పరిసరాలకు బందీ' అనే సూక్తికి సరిపోయే చిత్రంగా ఈ సినిమా అనే చెప్పుకోవచ్చు.

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు వధ్. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా వారిని ముందుకు నడిపిస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మిశ్రా అధిక వడ్డీకి రుణం తీసుకుని, తన పట్టుదల మేరకు తన కొడుకును చదువుకోవడానికి అమెరికాకు పంపిస్తాడు. అతను పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయుడు. కొడుకు అమెరికాలో స్థిరపడతాడు. అతను తన తల్లిదండ్రులను పట్టించుకోడు.

దీంతో అతడు రుణం తిరిగి చెల్లించే బాధ్యతను స్వీకరించడు. ఫలితంగా, అధిక వడ్డీ , రుణదాతల వేధింపుల కారణంగా ఆ వృద్ధ దంపతులు రోజురోజుకూ బాధపడుతుంటారు. ఒక వడ్డీ వ్యాపారి వృద్ధ దంపతుల ఇంటికి వస్తాడు. ఒక కలవరపరిచే సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. పరిస్థితుల కారణంగా అంతా మారిపోతుంది. కొంత సమయం తరువాత, ఊహించని మలుపుతో సినిమా పతాక సన్నివేశానికి చేరుకుంటుంది. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ఇద్దరూ అద్భుతమైన నటనను కనబరిచారు.

జీవితాన్ని వాస్తవికంగా చిత్రీకరించడం, దానికి తగ్గట్టుగా వారి నటన ఈ చిత్రానికి బలం. కొడుకు వదిలేసినప్పటికీ ఆత్మగౌరవంతో నిండిపోయే సన్నివేశాలు, వారి మధ్య బంధం, వారు సమస్యలను ఎదుర్కొనే విధానం ప్రత్యేకంగా నిలుస్తాయి. దర్శకుడు జైపాల్ సింగ్ చాలా తక్కువ బడ్జెట్తో, కొద్ది పాత్రలతో ఒక క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించి, విసుగు పుట్టించకుండా కథను ఆసక్తికరంగా నడిపించారు. రెండు గంటల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఒక విందు లాంటిది.

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది 2022లో విడుదలైన ఒక అద్భుతమైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక విలక్షణమైన కథాంశంతో, ప్రేక్షకులను ఆకట్టుకునే సస్పెన్స్తో సాగుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు 'దృశ్యం' (Drishyam) సినిమా గుర్తుకు వస్తుంది. ఒక సామాన్యుడు క్రైమ్ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే కోణం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.అలాగే 'బాగ్బాన్' సినిమా తరహాలో పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసి, చివరకు వారి వల్ల మోసపోయిన వృద్ధ తల్లిదండ్రుల బాధను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు.