మెగా హీరోలైన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీగా బ్రో.. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశారు. మామ అల్లుడు కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది.
దీంతో ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ సహా చిత్ర యూనిట్ దర్శించుకుంది.
సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
అమ్మవారిని దర్శించకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, లడ్లను అందించారు.